అమెరికా అంబాసిడర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్

అమెరికా అంబాసిడర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్

న్యూఢిల్లీ: మణిపూర్ ఇష్యూకు సంబంధించి మన దేశంలోని అమెరికా అంబాసిడర్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ ఫైర్ అయింది. మన దేశ అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలిపింది. ‘‘గత 40 ఏండ్ల నా ప్రజా జీవితంలో అమెరికా నుంచి ఎప్పుడూ ఇలాంటి కామెంట్లు వినలేదు. అమెరికా అంబాసిడర్ చేసిన కామెంట్లు నాకు ఆశ్చర్యం కలిగించాయి” అని కాంగ్రెస్ సీనియర్ లీడర్ మనీశ్ తివారీ శుక్రవారం ట్వీట్ చేశారు. 

కాగా, మణిపూర్ ఆందోళనలు వ్యూహాత్మకంగా జరుగుతున్నవి కాదని, దీని వెనుక మానవీయ కారణాలు ఉన్నాయని అమెరికా అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి గురువారం కామెంట్ చేశారు. మహిళలు, చిన్నారులు చనిపోతుంటే స్పందించడానికి ఇండియనే కావాల్సినపనిలేదని, ఎలాంటి సాయం అడిగినా చేసేందుకు సిద్ధమని చెప్పారు.