కేటీఆర్‌‌‌‌‌‌‌‌వి అహంకారపు మాటలు : కేకే మహేందర్ రెడ్డి

కేటీఆర్‌‌‌‌‌‌‌‌వి  అహంకారపు మాటలు : కేకే మహేందర్ రెడ్డి

తంగళ్లపల్లి, వెలుగు: మంత్రి కేటీఆర్​అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ రాష్ట్ర నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని పైర్ అయ్యారు. గురువారం తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లెలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరించి ఇంటింటి ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్ ​రాష్ట్రంలో దోచుకున్న పైసలతో దేశ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. 

కేటీఆర్ సిరిసిల్లను మాఫియాలకు అడ్డాగా మార్చాడని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు.