స్మృతి ఇరానీ కారును అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

స్మృతి ఇరానీ కారును అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, కుట్రలు ప్రజలందరికీ తెలుసన్నారు. అందువల్లే 2019 ఎన్నికల్లో బీజేపీకి చారిత్రాత్మక విజయాన్ని జనాలు కట్టబెట్టారని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక నాయకుడిని మనం ఆపలేమని… కానీ, హత్రాస్ కు కేవలం రాజకీయాల కోసమే ఆయన వెళ్లాలనుకుంటున్నారని, బాధిత కుటుంబానికి న్యాయం కోసం కాదనే విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. అయితే స్మృతి ఇరానీ  వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అయ్యారు. వారణాసిలో ఆమె ప్రయాణిస్తున్న కారును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ‘స్మృతి గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశాయి.

మరోవైపు గ్యాంగ్ రేప్, మర్డర్ కు గురైన 20 ఏళ్ల యువతి గ్రామమైన హత్రాస్ కు వెళ్లేందుకు రాహుల్ గాంధీ ఇవాళ కూడా మరోసారి ప్రయత్నించారు. నిన్న(శుక్రవారం) పోలీసులు అడ్డుకోగా రాహుల్ కిందపడిపోయారు.ఈ క్రమంలో ఆయన శనివారం మరోసారి తన ప్రయత్నం చేస్తున్నారు.