ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను టార్గెట్ చేస్తూ మరో లేఖ రిలీజ్ చేశారు సుఖేష్ చంద్రశేఖర్. ప్రస్తుతం జైల్లో ఉన్న సుఖేష్.. తన లాయర్ నుంచి ఈ లేఖలను విడుదల చేస్తున్నాడు. మొన్న రిలీజ్ చేసిన లేఖపై కవిత ఇచ్చిన కౌంటర్ కు సమాధానం ఇచ్చారు. అదే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు ఇవ్వటంపైనా స్పందిస్తూ.. ఏప్రిల్ 15వ తేదీ మరో లేఖ రిలీజ్ చేశాడు చంద్రశేఖర్.
లేఖలోని ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి..
>>> కవిత ఫోన్ నెంబర్లు ఇవే అంటూవాటిని బయటపెట్టారు. +91-62099xxx99, +91-89856xxx99 (ఫోన్ నెంబర్లను హైడ్ చేయటం జరిగింది). ఈ నెంబర్ల నుంచే ఎమ్మెల్సీ కవితక్కతో మాట్లాడినట్లు లేఖలో స్పష్టం చేశాడు సుఖేష్. ఈ నెంబర్ల నుంచే కవితకు వాట్సాప్ చాట్ చేసినట్లు వెల్లడించాడు.
>>> సుఖేష్కి తెలుగు ఎలా తెలుసని BRS నాయకులు ప్రశ్నిస్తున్నారు. నాకు తెలిసిన భాషలే కాకుండా.. నా మాతృభాష తెలుగు, తమిళం అని చాలా స్పష్టంగా తెలియజేస్తాను. నా చిన్నప్పటి నుంచి ఇంట్లో మా తల్లిదండ్రులు తెలుగు, తమిళంలో మాట్లాడతారు. అది నా మాతృభాష అని కౌంటర్ ఇచ్చారు.
>>> జైలు నుంచి సుఖేష్ లేఖలు ఎలా రాస్తున్నాడు.. ఫొటోలు, వీడియోలు ఎలా రిలీజ్ చేస్తున్నాడని ప్రశ్నిస్తున్నారని.. ఈ విషయంలో నాకు స్పష్టమైన క్లారిటీ ఉందన్నాడు సుఖేష్. కవిత, కేజ్రీవాల్ తో మాట్లాడిన, చాట్ చేసిన ఫొటోలు, వీడియోలు అన్నీ బయటకు ఉన్న తన టీం దగ్గర భద్రంగా ఉన్నాయని.. లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు కోరిన వెంటనే నా టీం.. ఆధారాలను సమర్పిస్తుందంటూ లేఖలో రాశాడు చంద్రశేఖర్. ఎమ్మెల్సీ కవితను ఎల్లప్పుడూ నా అక్కగానే భావిస్తానంటూ వినయం ప్రదర్శించాడు సుఖేష్.