కాంగ్రెస్లో చేరికలకు గేట్లు ఓపెన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చిందని, ఇక నుంచి తాను పీసీసీ ప్రెసిడెంట్గా తన రాజకీయం ఏమిటో చూపిస్తానని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పదేపదే అంటున్నరు. వాళ్లు ప్రభుత్వాన్ని పడగొడ్తామంటే చూస్తూ ఊరుకోం” అని హెచ్చరించారు.
కొద్దిమంది అధికారుల చేతుల్లోనే అధికారాన్ని పూర్తిగా పెట్టిన విధానానికి స్వస్తి పలికామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రతిశాఖకు సమర్థవంతమైన అధికారులను నియమించి, స్వేచ్ఛగా వాళ్లు నిర్ణయాలు తీసుకునేలా పరిపాలనను వికేంద్రీకరించామన్నారు. పదేండ్లుగా పేరుకుపోయిన వేలాది ఫైళ్లను పరిష్కరించుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నామన్నారు.6 గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు.
గత సర్కార్ తీరుతోనే నీళ్ల సమస్య
నిరుడు వర్షాలు పడలేదని, రిజర్వాయర్లలో ఉండాల్సిన నీటిని గత సర్కార్ నిర్లక్ష్యంతో మెయింటెయిన్ చేయలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. నీళ్లను పక్క రాష్ట్రం తరలించుకుపోతుంటే కూడా గత కేసీఆర్ సర్కార్ నియంత్రించే పనిచేయలేదని అన్నారు. అయినా చిన్న సమస్య కూడా రాకుండా ముందుకు పోతున్నామని తెలిపారు.
ALSO READ | కుట్రలు తిప్పి కొడ్తం : సీఎం రేవంత్ రెడ్డి
తాగునీటిపై కర్నాటక ప్రభుత్వ అధికారులతో మన ఆఫీసర్లు మాట్లాడుతున్నారని వివరించారు. విద్యుత్ విషయంలో కొందరు వారి ఏరియాల్లో లైన్మన్లకు ఫోన్లు చేసి వీఐపీ మీటింగ్స్లో కావాలని కరెంట్ కట్ చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని, అట్లాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.