న్యూఢిల్లీ: రాహుల్ గాంధీని బదనాం చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాష్ట్రపతి 'ఎట్ హోమ్' ప్రోగ్రామ్లో అస్సామీ సాంప్రదాయ గమోసా(స్కార్ఫ్) విషయంలో రాహుల్పై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
"రాష్ట్రపతి ఎట్ హోమ్ ప్రోగ్రామ్లో రాహుల్ గాంధీ గమోసా ధరించకుండా ఈశాన్య రాష్ట్రాలను, వాటి సంస్కృతిని అవమానించారని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నది. నిజానికి రాహుల్ గమోసా ధరించారు. తర్వాత చేతిలో పట్టుకున్నారు. నేనూ, రాహుల్ తినేటప్పుడు గమోసాను టేబుల్పై పెట్టాం. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ గమోసా ధరించలేదు. బీజేపీ నేతలే ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిని అవమానించారు. రాహుల్ మాత్రమే ఈశాన్య కళాకారులందరినీ ఆత్మీయంగా కలిశారు" అని ఖర్గే పేర్కొన్నారు.
