ఉచిత పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

ఉచిత పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

మహబూబాబాద్ జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర చీఫ్ కో ఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్  ప్రవీణ్ కుమార్. ఎన్నికలకు ముందు ఉచిత పథకాలు, మద్యం, డబ్బులు పంపిణీ చేసి గద్దెనెక్కుతున్నారని విమర్శించారు. బహుజనులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బిఎస్పీకి ఓటువేసి ఈ దొరల పాలనకు చరమ గీతం పాడాలన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగుతోంది. ఇవాళ బంజారలో యాత్రను నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రవీణ్ కుమార్.

 

ఇవి కూడా చదవండి

ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు

ఎస్సీ ఉప కులాలకు చట్ట సభల్లో అవకాశమివ్వాలె