తుపాకీ మిస్‌ ఫైర్‌.. హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

తుపాకీ మిస్‌ ఫైర్‌.. హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

తుపాకీ మిస్‌ఫైర్‌ కావడంతో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన భూపతి శ్రీకాంత్‌ ( 30 ) పాతబస్తీ హుస్సీనీ ఆలం పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 

అయితే ఎప్పటిలాగే డ్యూటీ ముగించుకుని శ్రీకాంత్‌ భూపతి నిద్రిస్తున్న క్రమంలో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది.  ఈ ఘటనలో తీవ్ర గాయలపాలైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.  అక్కడ చికిత్స  పొందుతూ  చనిపోయాడు.  

ఉస్మానియా మార్చురీకి డెడ్ బాడీ తరలించారు.  కాగా, గతంలో గన్ మిస్ ఫైర్ అయిన ఘటనల్లో పలువురు కానిస్టేబుల్, హోంగార్డ్స్ మరణించారు.