తుపాకీ మిస్ఫైర్ కావడంతో ఓ హెడ్ కానిస్టేబుల్ మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన భూపతి శ్రీకాంత్ ( 30 ) పాతబస్తీ హుస్సీనీ ఆలం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే ఎప్పటిలాగే డ్యూటీ ముగించుకుని శ్రీకాంత్ భూపతి నిద్రిస్తున్న క్రమంలో గన్ మిస్ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో తీవ్ర గాయలపాలైన అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.
ఉస్మానియా మార్చురీకి డెడ్ బాడీ తరలించారు. కాగా, గతంలో గన్ మిస్ ఫైర్ అయిన ఘటనల్లో పలువురు కానిస్టేబుల్, హోంగార్డ్స్ మరణించారు.