
కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేదని నటుడు శివాజీ రాజా అన్నారు. ‘రేవు’ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తాజాగా తమ సెకండ్ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. నిర్మాత పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘వైల్డ్ బ్రీత్’ టైటిల్తో దీన్ని రూపొందిస్తున్నట్టు రివీల్ చేశారు. హరినాథ్ పులి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు శివాజీ రాజా, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరై టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని, షూటింగ్ తుది దశలో ఉందని దర్శకుడు హరినాథ్ చెప్పాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని నిర్మాత రాంబాబు తెలియజేశారు.