న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్స్తోపాటు, మెడికల్ సప్లయ్లపై జీఎస్టీ మినహాయింపుపై శుక్రవారం మీటింగ్లో జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. జూన్ 8 నాడు ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు మీటింగ్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మీడియాకు చెప్పారు. అయితే, బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్కు వాడే మెడిసిన్స్ దిగుమతులపై డ్యూటీ మినహాయింపును జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. వ్యాక్సిన్స్, మెడికల్ సప్లయ్లపై ట్యాక్స్ స్ట్రక్చర్ను మంత్రుల గ్రూప్ చర్చించనున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. బ్లాక్ఫంగస్ ట్రీట్మెంట్లో కీలకమైన యాంఫోటెరిసిన్–బీ మెడిసిన్పై ఐ–జీఎస్టీ మినహాయిస్తున్నట్లు కౌన్సిల్ వెల్లడించింది. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు వచ్చిన లోటు పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వమే రూ. 1.58 లక్షల కోట్లను అప్పుగా తీసుకుని, ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని కూడా కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాలకు ఇచ్చే కాంపెన్సేషన్ గడువును మరో అయిదేళ్లు పొడగించేందుకు కౌన్సిల్ ప్రత్యేక సెషన్ త్వరలో నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ముందుగా అనుకున్న ప్రకారం 2022 దాకా మాత్రమే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాదిలో జరిగిన మొదటి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఇదే. నిజానికి ప్రతి మూడు నెలలకూ ఒకసారి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా, కిందటేడాది అక్టోబర్ తర్వాత జరగలేదు.
వ్యాక్సిన్పై జీఎస్టీ కంటిన్యూ..
- దేశం
- May 29, 2021
లేటెస్ట్
- అవసరమైతే కేసీఆర్నూ పిలుస్తం : పినాకి చంద్రఘోష్
- సీఎం రేవంత్-రిజర్వేషన్లు | కేసీఆర్-కాళేశ్వరం విచారణ | మోడీ వర్సెస్ రాహుల్ ఎన్నికల ప్రచారం| V6 తీన్మార్
- IPL 2024: సన్ రైజర్స్ ఘోర ఓటమి..6 ఓటముల తర్వాత ఆర్సీబీ విజయం
- పటాన్ చెరులో భారీగా గంజాయి పట్టివేత
- తెలంగాణ కోసమే దేవుడు నన్ను పుట్టించిండు:కేసీఆర్
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- PM Kisan: రైతులకు పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?
- జగన్ కోసం జనంలోకి భారతి..
- బర్గర్ ఒకరి ప్రాణం తీసింది.. మరొకరిని జైలుకు పంపింది..
- కాంగ్రెస్ లేకుండా చేయాలనుకుండు.. కేసీఆరే ఖతం అయ్యిండు: రాజగోపాల్ రెడ్డి
Most Read News
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- Good Health : వయస్సుకు తగ్గట్టు ఎక్సర్ సైజ్ చేయాలి.. ఎలా పడితే అలా చేస్తే అనారోగ్యమే..!
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- దోస్త్కు వేళాయే.. ఇది ఇంటర్ పాసైన వాళ్ల కోసమే.!