
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్స్తోపాటు, మెడికల్ సప్లయ్లపై జీఎస్టీ మినహాయింపుపై శుక్రవారం మీటింగ్లో జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. జూన్ 8 నాడు ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు మీటింగ్ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మీడియాకు చెప్పారు. అయితే, బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్కు వాడే మెడిసిన్స్ దిగుమతులపై డ్యూటీ మినహాయింపును జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. వ్యాక్సిన్స్, మెడికల్ సప్లయ్లపై ట్యాక్స్ స్ట్రక్చర్ను మంత్రుల గ్రూప్ చర్చించనున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. బ్లాక్ఫంగస్ ట్రీట్మెంట్లో కీలకమైన యాంఫోటెరిసిన్–బీ మెడిసిన్పై ఐ–జీఎస్టీ మినహాయిస్తున్నట్లు కౌన్సిల్ వెల్లడించింది. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు వచ్చిన లోటు పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వమే రూ. 1.58 లక్షల కోట్లను అప్పుగా తీసుకుని, ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని కూడా కౌన్సిల్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాలకు ఇచ్చే కాంపెన్సేషన్ గడువును మరో అయిదేళ్లు పొడగించేందుకు కౌన్సిల్ ప్రత్యేక సెషన్ త్వరలో నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ముందుగా అనుకున్న ప్రకారం 2022 దాకా మాత్రమే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈ ఏడాదిలో జరిగిన మొదటి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఇదే. నిజానికి ప్రతి మూడు నెలలకూ ఒకసారి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ, కరోనా మహమ్మారి కారణంగా, కిందటేడాది అక్టోబర్ తర్వాత జరగలేదు.