
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి సివిల్ సప్లయ్ ఆఫీస్లో వడ్ల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను బుధవారం అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడితే 08468-220051కు సంప్రదించాలన్నారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తుందన్నారు. సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్రావు, డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.