ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా మరణాలు

ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా మరణాలు

ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5210 కొత్త కేసులు నమోదైన‌ట్టు ఏపీ ఆరోగ్యశాఖ బులెటిన్ ను రిలీజ్ చేసింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,55,727 కి చేరింది. ఇందులో 46,295 కేసులు యాక్టివ్ గా ఉంటె, 7,03,208 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 30 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6224కి చేరింది. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే, అనంతపురం లో 311, చిత్తూరులో 713, తూర్పుగోదావరి జిల్లాలో 701, గుంటూరులో 431, కడపలో 418, కృష్ణాలో 462, కర్నూలులో 175, నెల్లూరులో 288, ప్రకాశంలో 362, శ్రీకాకుళంలో 212, విశాఖపట్నంలో 190, విజయనగరంలో 161, పశ్చిమ గోదావరిలో 786కేసులు నమోదయ్యాయి.