వరుసగా మూడో రోజూ లక్ష దాటిన కరోనా కేసులు

వరుసగా మూడో రోజూ లక్ష దాటిన కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజూ కరోనా కేసులు లక్ష దాటాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా లక్షా 31 వేల 968 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య కోటి 30 లక్షల మార్కును దాటింది. కరోనా బారినపడి గురువారం దేశవ్యాప్తంగా 780 మంది చనిపోయారు. కరోనా సెకండ్ వేవ్ మొదలైన ఈ స్థాయిలో మరణాలు సంభవించటం ఇదే తొలిసారి.  వైరస్ కేసులు పెరుగుతుండటంతో... బాధితుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో 9 లక్షల 79 వేల 608 యాక్టీవ్ కేసులు ఉండగా... గురువారం ఒక్క రోజే 61 వేల 899 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.