మరోసారి రెండువేలకు పైగా కరోనా కేసులు

మరోసారి రెండువేలకు పైగా కరోనా కేసులు

దేశంలో స్వల్పహెచ్చుతగ్గులతో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసులు పెరిగాయి. మరోసారి రెండువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2 వేల 364 మందికి వైరస్ సోకినట్లు తేలింది. నిన్న మరో 2 వేల 582 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. దీంతో రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 15 వేల 419గా ఉంది. నిన్న వైరస్ బారిన పడి మరో 10 మంది చనిపోయారు. ఇప్పటివరకు 191 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశామంది కేంద్రం.