త‌మిళ‌నాడులో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు

త‌మిళ‌నాడులో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు

తమిళనాడులో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇవాళ ఒక్కరోజే ఇక్కడ 4,329 మంది కరోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య లక్ష మార్కును దాటింది. ఇవాళ మరో 64 మంది మృతి చెందడంతో కరోనా మరణాల సంఖ్య 1,385కు పెరిగింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,02,721కు చేరినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా 4,329 కొత్త కేసుల్లో ఒక్క చెన్నై నగరం నుంచే 2,082 మందికి ఉన్నారు. శుక్రవారం 2,357 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు తమిళనాట కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 58,378కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 42,955 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.