యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం

యాదాద్రి ఆలయంలో కరోనా కలకలం

యాదాద్రి జిల్లా: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం మరో 35 మందికి కరోనా సోకింది. గత మూడు రోజులుగా సెకండ్ వేవ్ ప్రభావంతో కరోనా కేసులు పెరుగున్నాయి. మొన్న ఆరు కేసులు నమోదు కాగా.. నిన్న ఒక్కరోజే 33 కేసులు నమోదు కావడం కలకలం రేపింది. ఇంతలోనే ఆదివారం తాజాగా మరో 35 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపధ్యంలో దేవాదాయ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తుల రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నారు. శానిటైజ్ చేయడంతోపాటు.. సామాజిక దూరం పాటించేలా మైకుల్లో అప్రమత్తం చేస్తున్నారు. భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో ఆలయ ఉద్యోగులు, అర్చకుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపధ్యంలో అధికారులు అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేశారు.