ఏపీలో 6 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

ఏపీలో 6 వేలు దాటిన కరోనా మృతుల సంఖ్య

ఏపీలో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 723512 కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 38 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6019కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51060 కేసులు యాక్టివ్ గా ఉండగా, 666433 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 86 కేసులు నమోదు కాగా, తూర్పుగోదావరి జిల్లాలో 853 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 444, కడపలో 231, కృష్ణా జిల్లాలో 179, కర్నూలులో 86, నెల్లూరులో 365, ప్రకాశంలో 666, శ్రీకాకుళంలో 157, విశాఖపట్నంలో 138, విజయనగరంలో 129, పశ్చిమ గోదావరిలో 129 కేసులు నమోదయ్యాయి.