కరోనా ఎఫెక్ట్: 27 అడుగుల ఖైరతాబాద్ గణేషుడు

కరోనా ఎఫెక్ట్: 27 అడుగుల ఖైరతాబాద్ గణేషుడు

గతేడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా పూజలు అందుకున్నాడు హైదరాబాద్  ఖైరతాబాద్ గణేషుడు. కరోనా కారణంగా ఈ ఏడాది 27 అడుగులకే పరిమితం కానున్నాడు.  ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్  కారణంగా ఈ సారి ఖైరతాబాద్ గణేషుడి విగ్రహన్ని తక్కువ ఎత్తుకే పరిమితం చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. గతేడాది కంటే 38 అడుగులు తక్కువగా విగ్రహాన్ని రూపొందించాలని నిర్ణయించారు. అలాగే ఈ సారి పూర్తిగా మట్టితోనే విగ్రహాన్ని రూపొందించాలని ఖైరతా బాద్ గణేష్ కమిటీ నిర్ణయించింది.  భౌతికదూరం పాటిస్తూ దర్శనాలు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా కూడా దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకులు తెలిపారు.