పద్మారావునగర్, వెలుగు: కరోనా కొత్త వేరియంట్లతో పెద్దగా ముప్పేమీ ఉండదని గాంధీ ఆస్పత్రి డీఎంఈ డాక్టర్ కె. రమేశ్రెడ్డి అన్నారు. ఒమిక్రాన్ బీఎఫ్–7కు భయపడొద్దని, కానీ అల్టర్ గా ఉండాలని సూచించారు. గాంధీ హాస్పిటల్లో మంగళవారం నిర్వహించిన కొవిడ్ మాక్డ్రిల్ సందర్భంగా రమేశ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్త వేరియంట్ కేసులతో అప్రమత్తమైన ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. సిటీలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిందని, ప్రతి ఒక్కరిలో ఇమ్యూనిటీ పవర్ పెరిగిందన్నారు.
అలర్ట్గా ఉంటూ మాస్కులు ధరించాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. సూపరింటెండెంట్డాక్టర్ రాజారావు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ఆక్సిజన్, వైద్య సిబ్బంది కొరత లేదని తెలిపారు. 650 ఐసీయూ బెడ్స్, 600 ఆక్సిజన్ బెడ్స్తో పాటు మొత్తం 1,890 బెడ్స్ఉన్నట్లు తెలిపారు. 530 వెంటిలేటర్లు ఉండగా ఇందులో 518 వర్కింగ్ కండీషన్లో ఉన్నాయని చెప్పారు. ఈ మాక్డ్రిల్లో భాగంగా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ బ్లాక్, ఓపీ, ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్లిక్విడ్ సిలిండర్ల ఏరియాలను సందర్శించి వివరాలు నమోదు చేశారు.