- ముందు జాగ్రత్తలు తీసుకుంటున్న ఆరోగ్యశాఖ
- రద్దీ ప్రాంతాల్లో ఉచితంగా పరీక్షలు చేయాలని నిర్ణయం
- సమాచారమిస్తే ఫంక్షన్లలోనూ..
నల్గొండ, వెలుగు: కరోనా వైరస్ సెకండ్ వేవ్ కట్టడికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఇప్పటివరకు సర్కారు ఆసుపత్రుల్లో టెస్ట్లు చేయగా ఇకపై మొబైల్ ప్రోగ్రాంగా చేపట్టాలని ని ర్ణయించారు. ఇటీవలి కాలంలో కరోనా టెస్ట్లు చేయించుకునే వారి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా తగ్గింది. టెస్ట్లు తగ్గడంతో పాజిటివ్ కేసులు కూడా కంట్రోల్ లో ఉన్నాయి. కానీ ప్రజలు కరోనా రూల్స్ అతిక్రమించి సాధారణ జీవనానికి అలవాటుపడిపోయారు. మాస్క్లు ధరించకపోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం, శానిటైజర్ వాడకం తగ్గించారు. ఒకరకంగా చె ప్పాలంటే కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలు తొలగిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు. వరుస పండుగలు, ఫంక్షన్ల హడావుడితో పట్టణాల్లో, గ్రామాల్లో ప్రజల రద్దీ పెరిగింది. ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో షాపింగ్మాల్స్, సూపర్మార్కెట్లు, ఫంక్షన్ హాల్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్స్లు ఫుల్టైం పని చేస్తున్నాయి. కరోనా ఫస్ట్ఫేజ్లో పాటించిన రూల్స్ఏవీ ఇప్పుడు సక్రమంగా అమలు చేయడం లేదు. దీంతో ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి ఉచితంగా కరోనా టెస్ట్లు చేయాలని వై ద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి కరపత్రాలు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పింది.
జనాలు వచ్చిపోయే ప్రాంతాల్లో..
గతంలో రోజుకు మూడు వేల వరకు కరోనా టెస్ట్లు చేశారు. కొంతకాలంగా నల్గొండ జిల్లాలో టెస్ట్ల సంఖ్య 1,700 మించడం లేదు. పరీక్ష చేసిన వాటిలో పాజిటివ్ కేసులు 40 నుంచి 60 వరకు నమోదవుతున్నాయి. చలికాలంలో వైరస్వ్యాప్తి పెరిగే చాన్స్ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్నా ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండటం లేదు. పైగా మాకెందుకు కరోనా టెస్ట్లు, మేం ఎందుకు చేయించుకోవాలనే ధోరణితో వ్యవహరిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా తెలిసింది. ఈ పరిస్థితిని చూసీచూడనట్లుగా వదిలేస్తే కరోనా సెకండ్వేవ్కట్టడి చేయడం సులువు కాదని భావించిన ఆఫీసర్లు అలర్ట్అయ్యారు. దీనికోసం ఎక్కువగా జనాలు వచ్చిపోయే షాపింగ్మాల్స్, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రతి పదిరోజులకోసా రి కరోనా టెస్ట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ఫంక్షన్లు జరిగే ప్రాంతాల్లో అతిధులు ఎంతమంది వస్తారనే ముందస్తు సమాచారం హెల్త్స్టాఫ్కు అందిస్తే మొబైల్ వెహికల్లో వచ్చి టెస్ట్లు చేస్తారు. వచ్చిపోయే జనాలు ఉన్న ఏరియాల్లోనే సిబ్బందికి టెస్ట్లు చేస్తారు. దీని వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయొచ్చని వైద్య ఆరోగ్య శాఖ ప్లాన్ చేసింది.
డిసెంబర్1 నుంచి అమలు
డిసెంబర్ 1 నుంచి కరపత్రాల రూపంలో పట్టణాల్లో ప్రచారం నిర్వహించేలా హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణాల్లోని వర్తక, వ్యాపార సంస్థల యజమానులకు మొబైల్ టెస్ట్ల గురించి హెల్త్ స్టాఫ్తో చెప్పిస్తారు. వ్యాపార సంస్థల ఓనర్లు కరోనా టెస్ట్లు చేయమని కోరిన వెంటనే హెల్త్ స్టాఫ్ను పంపించి సిబ్బందిని పరీక్షిస్తారు. చలికాలంలో సోకే దగ్గు, జలుబు లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. కరోనా లక్షణాల్లో ఇవి కూడా ఉండటంతో వాటి గురించి జనంలో ఉన్నటువంటి అపోహలను తొలగిస్తా రు.