IND vs ENG 2025: తొలి సెషన్‌లో టీమిండియా ఓపెనర్ల జోరు.. సాయి సుదర్శన్ డకౌట్

IND vs ENG 2025: తొలి సెషన్‌లో టీమిండియా ఓపెనర్ల జోరు.. సాయి సుదర్శన్ డకౌట్

లీడ్స్ వేదికగా శుక్రవారం (జూన్ 20) ప్రారంభమైన తొలి టెస్టు తొలి సెషన్ లో టీమిండియా రాణించింది. ఓపెనర్లు రాహుల్, జైశ్వాల్ అదరగొట్టడంతో మొదటి సెషన్ లో భారత్ పై చేయి సాధించింది. లంచ్ సమయానికి భారత్ 2 వికెట్ల నష్టానికి 92 పరుగగులు చేసింది. క్రీజ్ లో ఓపెనర్ జైశ్వాల్ (42), కెప్టెన్ శుభమాన్ గిల్ (0) ఉన్నారు. రాహుల్ 42 పరుగులు చేసి రాణించగా.. అరంగేట్ర టెస్టులో సాయి సుదర్శన్ డకౌటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్, కార్స్ తలో వికెట్ తీసుకున్నారు. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు రాహుల్, జైశ్వాల్ సూపర్ స్టార్ట్ ఇచ్చారు. ప్రారంభంలో రాహుల్ పూర్తిగా డిఫెన్స్ కు పరిమితం కాగా.. జైశ్వాల్ అడపాదడపా బౌండరీలు బాదాడు. జాగ్రత్తగా ఆడుతూ వీరు జట్టు స్కోర్ ను 50 పరుగులకు చేర్చారు. ఈ దశలో రాహుల్ బౌండరీలతో దూకుడుగా ఆడితే.. జైశ్వాల్ నెమ్మదించాడు. తొలి వికెట్ కు వీరిద్దరూ 92 పరుగులు జోడించారు. ఈ దశలో కార్స్ రాహుల్ వికెట్ తీసి ఇంగ్లాండ్ కు తొలి వికెట్ అందించాడు. తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్ పూర్తిగా నిరాశపరిచాడు. 

ఆడిన నాలుగో బంతికే స్టోక్స్ బౌలింగ్ లో డకౌటయ్యాడు. దీంతో భారత్ లంచ్ కు ముందు రెండో వికెట్ కోల్పోయింది. తోలి సెషన్ మొత్తం టీమిండియా ఆధిపత్య చూపించగా.. చివర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ సెషన్ ను బ్యాలన్స్ చేసింది.