ట్రీట్‌మెంట్ చేస్తలేరని కరోనా పేషంట్ పరారీ

ట్రీట్‌మెంట్ చేస్తలేరని కరోనా పేషంట్ పరారీ

సూర్యాపేట జిల్లాలో విచిత్రం చోటుచేసుకుంది. కరోనా ట్రీట్‌మెంట్ చేయడంలేదని ఓ పేషంట్ ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో జరిగింది. కరోనాతో ఆస్పత్రిలో చేరి రెండు రోజులైనా వైద్యులు చికిత్స చేయడంలేదని చంద్రశేఖర్ అనే కరోనా పేషంట్ సోమవారం రాత్రి హాస్పిటల్ నుంచి పారిపోయాడు. కాగా.. పారిపోయిన వ్యక్తి చివ్వెంల మండలంలోని వల్లభాపురం గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో.. గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. గ్రామానికి వచ్చిన పోలీసులు.. ఆ వ్యక్తిని విచారించగా.. అసలు విషయం చెప్పాడు. దాంతో పోలీసులు వెంటనే 108 ద్వారా జనరల్ హాస్పిటల్‌‌కు తరలించారు.