యశ్వంత్పుర: కరోనా సోకిన వ్యక్తి తమ గ్రామంలోకి అంబులెన్స్ రావడం చూసి తప్పించుకుని పరారయ్యాడు. కర్నాటకలోని యశ్వంత్ పుర నియోజకవర్గంలోని హవేరీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కరోనా పేషెంట్లతో ఒకవైపు ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్న నేపధ్యంలో కరోనా సోకినట్లు నిర్ధారణ అయినా కొద్ది మంది కరోనా సోకిన వారు దవాఖానకు పోయేందుకు భయపడుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం తమను బలితీసుకుంటుందేమోనని అనుమానంతో అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నా చికిత్స కోసం దవాఖానాకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. అంతగా ఇబ్బందిపడే పరిస్థితి వస్తే అప్పుడు వెళ్దాం అంటూ వాయిదాలు వేస్తూ పొద్దు గడిపేస్తున్నాడు కబ్బూరు తండాకు చెందిన వ్యక్తి. అందుకే కరోనా సోకినా స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతుండడంతో వైద్యం చేయించుకోవాలన్న ఇరుగుపొరుగు వారి హెచ్చరికలతో టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీంతో అతడ్ని వెంటనే హోం ఐసొలేషన్ ఉండాలని లేదా ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవాలని వైద్య సిబ్బందితోపాటు గ్రామస్తులు సూచించినా పట్టించుకోలేదు. మరోవైపు కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతూ భయాందోళన రేపుతున్న నేపధ్యంలో గ్రామస్తులు కొందరు ఇతని గురించి వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వెంటనే అంబులెన్స గ్రామానికి పంపారు. అయితే అంబులెన్స్ రాకను గుర్తించిన కరోనా పాజిటివ్ వ్యక్తి వెంటనే గ్రామంలో ఎవరికీ కనిపించకుండా ఉడాయించాడు.
అంబులెన్స్ రాకను చూసి పరారైన కరోనా రోగి
- దేశం
- April 30, 2021
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు