ఏపీలో కొత్తగా 6,555 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో కొత్తగా 6,555 మందికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 6,555 మందికి కరోనా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కరోనా మరణాలు, పాజిటివ్ కేసులకు సంబంధించి ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు అధికారులు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 975 కేసులు నమోదు అయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాల్లో 223 కేసులను గుర్తించారు. ఓవరాల్ గా రాష్ట్రం మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 7,06,790కి చేరుకుంది.

రాష్ట్రంలో మరో 31 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,900కి పెరిగింది. 7,485 మంది కరోనా నుంచి కోలుకున్నారు.