స్కూల్స్ సిబ్బంది తప్పకుండా టీకా రెండు డోసులు తీసుకోవాలి

స్కూల్స్ సిబ్బంది తప్పకుండా  టీకా రెండు డోసులు తీసుకోవాలి

విద్యాసంస్థల్లో కరోనా నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా థర్డ్ వేవ్ ముప్పుపై  సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు మంత్రి. విద్యార్థులు మాస్క్ లు, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు మంత్రి.విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

https://www.youtube.com/watch?v=3xXD6FWTTj0