భార్యాభర్తలకు కరోనా.. 108లోనే మృతి

భార్యాభర్తలకు కరోనా.. 108లోనే మృతి

చిత్తూరు: జిల్లాలోని పెద్దతిప్పసముద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సైదానీ, అబ్దుల్‌ రెహ్మాన్‌ దంపతులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. క్వారంటైన్‌ కు తరలిస్తుండగా భర్త అబ్దుల్‌ రెహ్మాన్‌ మృతి చెందాడు. భర్త చనిపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన భార్య సైదానీ గుండెపోటుతో 108లోనే ప్రాణాలు కోల్పోయింది. దంపతుల మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. కరోనా వచ్చిందనే విషయం తెలిసినప్పట్నుంచే సైదానీ, అబ్దుల్‌ రెహ్మాన్‌ భయపడ్డారని.. అందుకే ఇద్దరినీ అంబులెన్స్ ఎక్కిస్తుంటే ఏడ్చారని తెలిపారు స్థానికులు.