ఇంట్లోనే టెస్టు.. నిమిషాల్లో రిజల్ట్

ఇంట్లోనే టెస్టు.. నిమిషాల్లో రిజల్ట్

ఎన్సీఎల్ తో కలిసి కరోనా టెస్ట్ కిట్ తయారుచేస్తున్న ఐఐటీ ఢిల్లీ
నెలలో అందుబాటులోకి!

న్యూఢిల్లీ: లక్షణాలున్నోళ్లు టెస్టులు చేయించుకోవాలంటే పెద్దపరేషాన్ అయిపోయిందిప్పుడు. కొన్ని ఎంపిక చేసిన ల్యాబులు, ఆస్పత్రుల్లోనే టెస్టులు చేస్తున్నారు. ఒకవేళ టెస్టులు చేయించుకోవాలన్న3 రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి. మరి ల్యాబుకు వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే మనకు మనం టెస్టులు చేసుకునే సౌలత్ ఉంటే ఎంత బాగుంటుంది. దాన్నే నిజం చేయబోతున్నారు ఐఐటీ ఢిల్లీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిధిలోని నేషనల్ కెమికల్ లేబొరేటరీ (ఎన్సీఎల్–పుణే) సైంటిస్టులు. ఎవరి సాయం లేకుండా ఇంట్లోనే టెస్ట్ చేసుకునేలా ఓ టెస్ట్ కిట్ ను తయారు చేస్తున్నారు. దానికి మైక్రోసాఫ్ట్ ఇండియా డబ్బు సాయం కూడా చేస్తోంది. నెలలో అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎలీసా ఆధారంగానే..
ఎలీసా ఆధారంగానే ఈ టెస్ట్ కిట్ ను అభివృద్ధి చేస్తున్నారు సైంటిస్టులు. ఓ నెలలో ఆ టెస్ట్ కిట్ పనితీరు ఫలితాలు తెలుస్తాయని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే టెస్ట్ కిట్లో వాడే యాంటీజెన్ల తయారీపై దృష్టి పెడతామంటున్నారు. ఇప్పుడున్న ఆర్టీపీసీర్ టెస్టు కిట్లతో చేస్తే ఫలితాల కోసం కొన్ని గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని, హోం బేస్డ్ కిట్లతో నిమిషాల్లోనే రిజల్స్ట్ వస్తాయని ఐఐటీ ఢిల్లీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అనురాగ్ రాథోడ్ చెప్పారు. యాంటీజెన్లకు వ్యతిరేకంగా పోరాడే రక్తంలోని ఐజీజీ, ఐజీఎం అనే ఇమ్యునోగ్లోబ్యులిన్ల ఆధారంగా ఈ ఎలీసా టెస్ట్ కిట్ల ప్రాజెక్టును చేపట్టామన్నారు. ‘‘కొన్ని రకాల ప్రొటీన్లతో కరోనా వైరస్ బలపడుతోంది. స్పైక్(ఎస్), ఎన్వలప్(ఈ), మెంబ్రేన్(ఎం), న్యూక్లియో క్యాప్సిడ్(ఎన్) ప్రొటీన్లు ఆ వైరస్ కు కీలకం. అందులో ఎన్, ఎస్ ప్రోటీన్లే టార్గెట్ గా మేం ఎలీసా టెస్ట్ కిట్ తయారు చేస్తున్నాం. అంతా సక్సెస్ అయితే టెస్ట్ కిట్లలో కీలకమైన ఎన్, ఎస్ ప్రోటీన్ యాంటీజెన్లను వివిధ కంపెనీలు, ల్యాబుల్లో పెద్దసంఖ్యలో తయారుచేయిస్తాం’’ అని
ఆయన చెప్పారు. ఆ టెస్ట్ కిట్ ధర ఎంతుంటుందన్నది మాత్రం ఆయన చెప్పలేదు.

For More News..

రాత్రి 7 దాటితే ఏపీలోకి నో ఎంట్రీ

ఆన్ లైన్ క్లాసులపై నో క్లారిటీ.. అయినా ఆపమంటున్న ప్రైవేట్ సంస్థలు

డాడీ.. ఊపిరి ఆడుతలేదు.. ఆక్సిజన్‌‌ తీసేసిన్రు.. ఇక సచ్చిపోతున్న బై..