దేశంలో మరింత తీవ్రమవుతున్న కరోనా

దేశంలో మరింత తీవ్రమవుతున్న కరోనా

సెకండ్ వేవ్‌లో దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోందని హెచ్చరించింది కేంద్ర ఆరోగ్యశాఖ. తక్కువ సమయంలోనే కేసుల సంఖ్య ఐదు రెట్లు పెరిగిందని, పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపింది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది. పరిస్థితులు మరింత దిగజారకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. యావత్ దేశం ప్రమాదంలో పడుతోందని తెలిపింది. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ 5 లక్షలు దాటాయంది. ప్రస్తుతం 5,40,720 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.

దేశంలో 10 జిల్లాల్లో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. వీటిలో 8 జిల్లాలు మహారాష్ట్రలోనే ఉన్నాయంది. కరోనా కేసులు ఎక్కువగాఉన్న లిస్టులో పూణె మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, నాగపూర్, థానె, నాసిక్, ఔరంగాబాద్, బెంగళూరు అర్బన్, నాందేడ్, ఢిల్లీ, అహ్మద్ నగర్ ఉన్నాయి.