చైనాలో భారీగా పెరిగిన ఫుడ్ రేట్లు

చైనాలో భారీగా పెరిగిన ఫుడ్ రేట్లు

వైరస్​ ప్రభావంతో చైనాలో తిండి రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో తిండి రేట్లతో పోలిస్తే ఈ ఏడాది 21.4 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా కన్జ్యూమర్​ ధరలు 5.2 శాతం పెరిగాయి. పోర్క్​ ధరలు రెట్టింపయ్యాయి. ఆఫ్రికన్​ స్వైన్​ ఫీవర్​ భయాల నేపథ్యంలో పోర్క్​ ధరలు 9.3 శాతం ఎక్కువయ్యాయి. మంగళవారం చైనా సర్కార్​ విడుదల చేసిన రిపోర్ట్​ ఈ విషయాలను వెల్లడించింది. కూరగాయల ధరలూ 9.5 శాతం పెరిగినట్టు రిపోర్ట్​ వెల్లడించింది. కొవిడ్​కు మూల కారణమైన వుహాన్​ సిటీలో పరిస్థితిని చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ సమీక్షించారు. కొవిడ్​ వ్యాప్తి తర్వాత తొలిసారి ఆయన వుహాన్​కు వెళ్లారు. అధికారులు తీసుకుంటున్న చర్యలను ఆయన పరిశీలించారు. చైనా క్వారెంటైన్​ హోటల్​ కూలిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 20కి పెరిగింది. 61 మందిని శిథిలాల కింద నుంచి బయటకు తీశారు.