హైదరాబాద్, వెలుగు: విద్యుత్ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్వైద్యం అందాలన్న లక్ష్యంతో తెలంగాణ దక్షిణ విద్యుత్పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. నెట్వర్క్హాస్పిటళ్ల(ప్రైవేట్, కార్పొరేట్) సంఖ్యను 253కు పెంచుతూ సంస్థ సీఎండీ జితేశ్వి.పాటిల్గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న 71 హాస్పిటళ్లలో మాత్రమే వైద్య సేవలు పొందే అవకాశం ఉండేది. ఈ క్రమంలో సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయ్స్, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని హాస్పిటళ్ల సంఖ్యను పెంచారు. ఈ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
