
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడిని పసిగట్టలేకపోయామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన ఖమ్మం లోక్ సభ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాలకు ఇన్చార్జీగా పనిచేశానని, కొత్తగూడెం కచ్చితంగా గెలుస్తామని అనుకున్నాం కానీ ప్రజల నాడి తెలుసుకోలేకపోయామన్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయాలతో సబంధం లేని 38 మంది కొత్త వాళ్లు ఎమ్మెల్యేలుగా గెలిచారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. ఒక్క ఎమ్మెల్యే ఓడిపోతే ఏమవుతుందిలే అనుకొని కూర్చున్న చెట్టుకొమ్మలు ఒక్కొక్కటిగా నరుక్కున్నామని, చెట్టు కూలిపోయే పరిస్థితిని మనమే కొని తెచ్చుకున్నామని తెలిపారు. సిట్టింగ్ఎంపీ నామా నాగేశ్వర్రావుకే మళ్లీ ఖమ్మం లోక్సభ టికెట్ఇవ్వాలని తాను ప్రతిపాదిస్తున్నానని తెలిపారు.