
- అవినీతికి పాల్పడుతున్నారని సొంత పార్టీ కౌన్సిలర్ల ఆరోపణలు
- విచారణ జరిపించాలని డిమాండ్
- కన్నీరు పెట్టుకున్న చైర్పర్సన్
కంది, వెలుగు : సంగారెడ్డి మున్సిపాలిటీలో మంగళవారం నిర్వహించిన జనరల్బాడీ మీటింగ్లో రూలింగ్ పార్టీ కౌన్సిలర్లు చైర్పర్సన్పై తిరుగుబాటు చేశారు. చైర్పర్సన్తన బంధువులు మున్సిపల్లో సిబ్బంది కాకపోయినా, పనులు చేయకున్నా నెల నెలా వారికి జీతాలిస్తున్నారని ఆరోపించారు. శిల్ప వెంచర్లోని ఓ పార్క్
స్థలాన్ని కబ్జా చేసి తన బంధువుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించి అమ్ముకుంటున్నారని, ఈ రెండింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మొత్తం 24 మంది అధికార పార్టీ కౌన్సిలర్లలో 14 మంది చైర్పర్సన్ను వ్యతిరేకిస్తుండగా.. మంగళవారం మీటింగ్కు ముందు మున్సిపల్ఆవరణలో 13 మంది ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. కౌన్సిలర్ పద్మావతి అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. మరో 9 మంది సైలెన్స్గా ఉండిపోయారు. ఇందులో సాబెర్ అనే కౌన్సిలర్ మాత్రం చైర్పర్సన్కు సపోర్ట్ చేశాడు.
కన్నీళ్లు పెట్టుకున్న చైర్పర్సన్
కౌన్సిలర్ల ఆరోపణలపై స్పందించిన చైర్పర్సన్ విజయలక్ష్మి భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పెలా అవుతుందని, ఏదైనా ఉంటే పోలీస్స్టేషన్లో తేల్చుకుందామన్నారు. అయినా వినకుండా కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తుండడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ క్రమంలో కౌన్సిలర్ సాబేర్ కలుగజేసుకొని చైర్పర్సన్పై ఆరోపణలు ఆపాలని కోరగా.. మిగతా కౌన్సిలర్లు మండిపడ్డారు. మాట్లాడకుండా కూర్చోవాలని సూచించగా.. కౌన్సిల్లోనే ఉన్న అయన తమ్ముడు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ షఫీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుర్చీతో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న మిగతా కౌన్సిలర్లు ఆపారు. తర్వాత సమావేశం కొనసాగింది. వైస్ చైర్పర్సన్లత, ఆఫీసర్లు పాల్గొన్నారు.