దంతెవాడ‌ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు హతం

దంతెవాడ‌ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు హతం

చత్తీస్ఘడ్ దంతేవాడలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు హతమయ్యాడు. మృతి చెందిన మావోయిస్టు పై రూ.5 ల‌క్ష‌ల రివార్డు ఉంద‌ని అధికారి తెలిపారు. మృతి చెందిన  మావోయిస్టు దంతెవాడ జిల్లాలో అనేక హింసాత్మక ఘటనల్లో నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. 

ఎదురుకాల్పులు ముగిసిన తర్వాత.. ఒక నక్సల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని దంతెవాడ ఎస్పీ సిద్ధార్థ్ తివారీ తెలిపారు.మృతుడిని 34 ఏళ్ల అర్జున్ అలియాస్ లఖ్మా సోడిగా గుర్తించినట్టుగా చెప్పారు. మావోయిస్టు మలంగర్ ఏరియా కమిటీకి మిలీషియా కమాండర్ ఇన్‌ఛార్జ్‌గా అర్జున్ చురుకుగా పనిచేశాడని.. అతను హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ సహా 13 హింసాత్మక సంఘటనలలో పాల్గొన్నాడని తెలిపారు. ఘటన స్థలం నుంచి ఒక పిస్టల్, 5 కిలోల టిఫిన్ బాంబు, నక్సల్ యూనిఫామ్, కరెంట్ తీగలు, వైర్ కట్టర్, నక్సల్ లిటరేచర్, కొన్ని క్యాంపింగ్ మెటీరియల్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

మరిన్ని వార్తల కోసం..

జస్టిస్ ఫర్ పీఆర్సీ అంటూ టీచర్ల ఆందోళన