
జమ్మికుంట, వెలుగు : అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయం బుధవారం లెక్కించారు. 5 నెలల్లో 20 హుండీల ద్వారా రూ. 7,66,870 వచ్చినట్లు కరీంనగర్ డివిజన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓ కే సుధాకర్, అర్చకులు, సిబ్బంది మోహన్, రాజయ్య, మల్లారెడ్డి పాల్గొన్నారు