సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకున్న భార్యాభర్తలు

సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకున్న భార్యాభర్తలు

సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఐలేష్ భార్య, పిల్లలతో కలిసి.. ఆత్మహత్యాయత్నం చేశాడు. ముగ్గురు పిల్లలు, భార్యభర్తలు క్యాంప్ ఆఫీస్ దగ్గర పెట్రోల్ పోసుకొని సూసైడ్ అటెమ్ట్ చేశారు. తమకు చెందిన భూధాన్ భూమిని తీసుకున్న ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదన్నారు బాధితులు. రెవెన్యూ ఆఫీస్ చుట్టు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి పరిహారం కొట్టేసేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఇవాళ ఆత్మహత్యాయత్నం చేశారు. గతంలో 2019 జూన్ 17న కూడా వీళ్లు క్యాంప్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకు  ప్రయత్నించారు. వెంటనే స్పందించిన క్యాంప్ ఆఫీస్  భద్రతా సిబ్బంది.. పంజాగుట్ట పీఎస్ కు తరలించారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇవాళ మరోసారి సూసైడ్ అటెంప్ట్ చేశారు.