
తిరునూరు: నైరుతిరుతుపవనాలతో భారీవర్షాలు కేరళలో విధ్వంసం సృష్టిస్తున్నాయి.ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.అనేక చోట్ల ఇళ్లు నీట మునిగాయి. రోడ్లు, రైలుమార్గాలు తెపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల వరదలు, చెట్లు కూలి ప్రాణనష్టం సంభవించింది. గత రెండు రోజులుగా కేరళ అంతటా కురుస్తున్న భారీ వర్షాలకు ఏడుగురు మృతిచెందారు. ముగ్గురు గల్లంతయ్యారు. కేరళలోని అన్ని జిల్లాల్లో రెండురోజులు సెలవు ప్రకటించారు.
కొట్టాయం, పతనం తిట్ట, కాసరగోడ్, ఇడుక్కి, అలప్పుజా, ఎర్నాకులం, త్రిసూర్, కన్నూర్ మొత్తం 8 జిల్లాల్లో IMD రెడ్ అలెర్ట్ ప్రకటించింది. 24 గంటల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాలతో కేరళలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పట్టాలపై చెట్లు కూలడం, విద్యుత్ స్థంభాలు విరిగిపడటం వంటి సంఘటలనతో పలు రైళ్లు నిలిచిపోయాయి. శుక్రవారం తెల్లవారుజామున మంగళూరు సెంట్రల్ ,నేత్రావతి క్యాబిన్ మధ్య మర్నామికట్టే సమీపంలో పట్టాలపై పెద్ద చెట్టు కూలిపోవడంతో మంగళూరు సెంట్రల్ నుంచి కేరళ వైపు రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది.
శుక్రవారం కేరళను బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు ముంచెత్తాయి.చాలాచోట్ల నివాస ప్రాంతాలు మునిగిపోయాయి. ఇళ్లు ధ్వంసం అయ్యాయి. దాదాపు 12వందల మంది స్థానికులను సహాయక శిబిరాలకు తరలించారు. జిల్లాలోని ప్రధాన నదులలో నీటి మట్టం పెరగడంతో వాటి ఒడ్డున నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
కోరప్పుజ ఉపనది అయిన పూనూర్పుజలో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కోరప్పుజలోని కున్నమంగళం ,కొల్లిక్కల్ స్టేషన్ల దగ్గర వరద హెచ్చరికగా అల్లో అలెర్ట్ జారీ చేశారు.
భారీ వర్షం కారణంగా కొట్టాయం జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్ శనివారం సెలవులు ప్రకటించారు. కొట్టాయం, ఇడుక్కి, పతనం తిట్ట, ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్ , కాసర్గోడ్ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ఇచ్చారు.
భారీ వర్షం కారణంగా కొట్టాయం జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్ శనివారం సెలవులు ప్రకటించారు. కొట్టాయం, ఇడుక్కి, పతనం తిట్ట, ఎర్నాకుళం, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్ , కాసర్గోడ్ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ఇచ్చారు.
సముద్రంపైకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మే 30 నుంచి జూన్ 3 వరకు లక్షద్వీప్ తీరం వెంబడి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
పతనంతిట్ట జిల్లాలోని మణిమాల, అచ్చెంకోవిల్, పంబా నదులకు కేరళ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధారిటీ (KSDMA) వరద ప్రమాద హెచ్చరికగా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. కాసర్గోడ్ జిల్లాలోని మొగ్రాల్, నీలేశ్వర, ఉప్పల నదులు ఉప్పొంగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్న ప్రజలను రక్షించేందుకు కేరళ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. జూన్ 1నాటికి అలప్పుజ, పతనంతిట్ట, ఎర్నాకుళం, కోజికోడ్, వయనాడ్ లలో అదనపు బలగాలు చేరుకోనున్నాయి.
ఈసారి ముందస్తుగానే నైరుతి రుతుపవనాలు వచ్చాయి. మే 24 నాటికి కేరళను తాకాయి. సాధారణం కంటే 8రోజులకు ముందుగానే వచ్చాయి. దీంతో కేరళ తోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నైరుతి పవనాలతో సముద్రంలో అల్పపీడనం కారణంగా కేరళలో భారీవర్షాలు బీభత్సం సృష్టించాయి. మరో మూడు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.