అయోధ్యనే కాదు.. కాశీ కూడా హిందూవులదే.. వారణాసి పుణ్యక్షేత్రంలో ఉన్న జ్ఞానవాపి మసీదు బేస్ మెంట్ ప్రాంతంలో శివుడికి పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2024 జనవరి 31వ తేదీన.. జ్ఞానవాపి మసీదుపై జరిగిన విచారణలో ఈ మేరకు తీర్పు వెల్లడించింది న్యాయస్థానం.కోర్టు తీర్పుతో హిందువులకు ఇది అతిపెద్ద విజయం అని కాశీవిశ్వనాథ ట్రస్ట్ తెలిపింది. దీంతో వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని కాశీవిశ్వనాథ ట్రస్ట్ ప్రకటించింది.
జ్ఞానవాపి మసీదులో వారం రోజుల్లో శివుడికి పూజలు చేయటానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు లాయర్ శంకర్ జైన్. ఇకపై జ్ఞానవాపి మసీదులో శివుడికి పూజలు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కోర్టు తీర్పు తర్వాత కాశీ విశ్వనాథుని ట్రస్ట్ స్పందించింది. వారం రోజుల్లో మసీదులోని వ్యాస్ కా టెఖానా ప్రాంతంలో ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు పూజలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించింది.
Big news https://t.co/IrDAMrH66Q
— Secular Chad (@SachabhartiyaRW) January 31, 2024
మంగళవారం (జనవరి 30న) హిందూ ముస్లి పక్షాలు ఈ కేసులో తమ వాదనలు కోర్టుకు వినిపించాయి. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు జ్ఞానవాపి మసీదులో ఉన్న హిందూ దేవుళ్ల కు పూజలు చేసుకోవచ్చని ఆదేశించింది.
అయితే దీనిపై ముస్లిం పక్షం ఓ ప్రకటన విడుదల చేసింది. నేలమాళిగలో పూజలు చేసుకునే హక్కు ను పొందే విషయంలో ఏఎస్ ఐ నివేదికలో ఎక్కడా ప్రస్తావన లేదని.. దీనిపై అలహాబాద్ హైకోర్టులో అప్పీలు చేస్తామని అంజుమన్ ఇంతేజామియా కమిటీ వెల్లడించింది. దీనికి వ్యతిరేకిస్తూ హిందూ తరపున న్యాయవాది విష్ణు జైన్ అలహాబాద్ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించాలని కేవియట్ దాఖలు చేయనున్నారు.
ఈ తీర్పు సోమనాథ్ వ్యాస్ బేస్ మెంట్ కేసుకు సంబంధించింది. వ్యాస్ కుటుంబం 1993 వరకు నేలమాళిగలో పూజలు చేసేవారు. అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశంలో పూజలు నిలిపివేయబడ్డాయి.
గతేడాది(2023) ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మసీదు ప్రాంగణంలో సర్వే నిర్వహించిన సందర్భంగా నేలమాళిగను శుభ్రం చేశారు. 2024 జనవరి 17న వ్యాస్ నేలమాళిగను జిల్లా యంంత్రాంగం స్వాధీనం చేసుకుంది. వ్యాస్ నేలమాళిగలో పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ పక్షం పిటిషనర్లు కోరగా.. వారణాసి కోర్టు పూజలు చేసుకునేందుకు అనుమతినిచ్చింది.