- 3 లక్షల టెస్టులకు చేరువలో తమిళనాడు టాప్
- 2.10 లక్షల టెస్టులతో ఏపీ మూడో ప్లేస్
- ఐసీఎంఆర్–ఎన్ఐవీ టెస్ట్ కిట్ ‘కొవిడ్ కవచ్ ఎలీసా’
- 100% కచ్చితత్వం, 98.7% సెన్సిటివిటీతో పని
- దేశవ్యాప్తంగా టెస్టుల కోసం కిట్కు ఓకే చెప్పిన ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా టెస్టుల సంఖ్య మరో మైలురాయిని చేరింది. 20 లక్షల మార్కును దాటింది. దేశమంతటా ఇప్పటిదాకా 20 లక్షల 39 వేల 952 శాంపిళ్లను టెస్ట్ చేశారు. టెస్టుల జాబితాలో తమిళనాడు ముందుండగా, మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో 2,91,432 టెస్టులు చేయగా, మహారాష్ట్రలో 2,40,482 టెస్టులు చేశారు. ఇటు ఏపీలోనూ టెస్టుల సంఖ్య 2 లక్షల మార్కును దాటింది. జాబితాలో మూడో స్థానంలో ఉంది. మొత్తంగా అక్కడ 2,10,452 శాంపిళ్లను ఇప్పటిదాకా పరీక్షించారు. 2,04,243 టెస్టులతో రాజస్థాన్ నాలుగో స్థానంలో ఉంది. మరో నాలుగు రాష్ట్రాలు లక్షకుపైగా టెస్టులు చేశాయి. ఈ జాబితాలో ఉత్తర్ప్రదేశ్ (1,53,139), కర్నాటక (1,28,373) గుజరాత్ (1,24,708), ఢిల్లీ (1,19,736) ఉన్నాయి.
‘కొవిడ్ కవచ్ ఎలీసా’ టెస్ట్ కిట్కు ఓకే
పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) తయారు చేసిన ఐజీజీ ఎలీసా యాంటీబాడీ టెస్ట్కిట్కు ‘కొవిడ్ కవచ్ ఎలీసా’ అని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేరు పెట్టింది. వ్యాలిడేట్ చేసి దానికి ఓకే చెప్పింది. 100% కచ్చితత్వం, 98.7% సెన్సిటివిటీతో ఈ టెస్ట్ కిట్ పనిచేస్తోందని వ్యాలిడేషన్లో తేలినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. రెండున్నర గంటల్లో ఒకేసారి 90 శాంపిళ్లను ఈ ఎలీసా కిట్తో టెస్ట్ చేయొచ్చని పేర్కొంది. జిల్లా స్థాయిల్లో దీనిని వాడడం చాలా ఈజీ అని పేర్కొంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్తో పోలిస్తే కొవిడ్ కవచ్ ఎలీసాకు బయోసేఫ్టీ, బయోసెక్యూరిటీ అవసరాలు చాలా తక్కువని చెప్పింది. వీటిని ఎక్కువ మొత్తంలో తయారు చేయడానికి స్పాన్, జే మిత్ర, జైడస్ క్యాడిలా, సిప్లా కంపెనీలకు ఆఫర్ ఇచ్చామని, ఒక్క జైడస్ క్యాడిలా తప్ప మిగతా మూడు కంపెనీలు ఆఫర్ తీసుకోలేదని ఐసీఎంఆర్ చెప్పింది. దీంతో క్యాడిలాతో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. జిల్లా స్థాయిల్లో టెస్టులు చేయడానికి సిద్ధమవుతుండడంతో ఇప్పుడు సిప్లా, నెక్ట్స్జెన్ లైఫ్ సైన్సెస్ కూడా కొవిడ్ కవచ్ ఎలీసాను తయారు చేసేందుకు ముందుకొచ్చాయని తెలిపింది. ప్రస్తుతం కంపెనీల ఆఫర్ను పరిశీలిస్తున్నామని చెప్పింది. ఐసీఎంఆర్ గైడ్లైన్స్కు తగ్గట్టు నాన్ ఎక్స్క్లూజివ్ లైసెన్స్ కింద ప్రొడక్షన్కు అనుమతిస్తామని చెప్పింది.

