
భారత్ లో రికవరీ కేసులకంటే మూడు రేట్లు యాక్టీవ్ కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మనదేశంలో కరోనా రికవరీ కేసులు 23లక్షలు దాటగా..మూడు రెట్లు ఎక్కువగా యాక్టీవ్ కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 61,408 కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 31.06 లక్షలకు చేరింది. వీరిలో 23,38,036 మందికి కరోనా తగ్గగా అందులో 7,10,771 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 836 మంది మరణించగా..ఇప్పటి వరకు దేశంలో మరణించిన వారి సంఖ్య 57,542 గా ఉంది.