చనిపోయిన దూడను ఎత్తుకెళ్లిన వ్యక్తిపై ఆవు దాడి – వీడియో

చనిపోయిన దూడను ఎత్తుకెళ్లిన వ్యక్తిపై ఆవు దాడి – వీడియో

తల్లి మనసు ఆక్రోషించింది. కోపం కట్టలు తెంచుకుంది.. తన దూడను కోల్పోయిన ఘటన ఓ ఆవును ప్రశాంతంగా ఉండనీయలేదు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కృష్ణాజిల్లా మచిలీపట్నం బస్టాండ్ వద్ద ఆవు ఓ రిక్షా అతనిపై దాడికి చేసింది. రిక్షాను ఎత్తి పడేసింది. అయితే 15 రోజుల క్రితం అదే ప్రాంతంలో గుర్తు తెలియని వాహణం దూడ గుద్దింది. దీంతో ఆ లేగదూడ చనిపోయింది. ఆ దూడ ఈ ఆవుదే…  ఇదే రిక్షా అతను ఆ లేగదూడను రిక్షాలో తీసుకెళ్లాడు… గత 15రోజుల నుంచి తన దూడకోసం ఎదురుచూసిన ఆవు… నిన్న అటువైపుగా రిక్షా అతను వెళ్తుండగా గుర్తు పెట్టుకుని అతనిపై దాడి చేసింది. దీంతో స్థానికులు అతన్ని రక్షించారు. ఆవు గుర్తుపెట్టుకుని రిక్షా అతనిపై దాడిచేయడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.