
సికింద్రాబాద్, వెలుగు: విద్యాసంస్థల్లో ర్యాగింగ్ పోయి.. డ్రగ్స్ వచ్చి చేరిందని, ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీటీ సీపీ ఆనంద్ పిలుపునిచ్చారు.- విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్కమిటీల ఏర్పాటుపై- ఉస్మానియా వర్సిటీలోని టాగూర్ ఆడిటోరియంలో శనివారం సమావేశం నిర్వహించారు. సీపీ సీవీ ఆనంద్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. స్టూడెంట్లకు తోటివారే డ్రగ్స్ అలవాటు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. పరిస్థితిని అదుపుచేయకపోతే డ్రగ్స్ వాడకం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాలేజీల్లో గతంలో ర్యాగింగ్ను అరికట్టినట్లే ఇప్పుడు డ్రగ్స్పనిపట్టాలన్నారు. డ్రగ్స్ తీసుకునే అమ్మాయిల శాతం పెరిగిందని .. తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. ప్రతి కాలేజీలో యాంటీ డ్రగ్స్కమిటీలను ఏర్పాటు చేయాలని, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సిటీలోని 55 కాలేజీల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై వేధింపులను అరికట్టేందుకు తొందరలోనే ప్రత్యేక చట్టం రాబోతుందని సీపీ వెల్లడించారు. ఇటీవల డీఏవీ స్కూళ్లో జరిగిన ఘటన తర్వాత ఈ చట్టంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఇంజినీరింగ్కాలేజీ ప్రిన్సిపల్ శ్రీరాం వెంకటేశ్, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్మాన్, డీసీపీలు సునీల్ దత్, జి.చక్రవర్తి, వివిధ కాలేజీలకు చెందిన దాదాపు వెయ్యి మంది స్టూడెంట్లు పాల్గొన్నారు.
గాంధీలో మెడికోలకు అవగాహన
పద్మారావునగర్ : గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్కమిటీలు, చిలకలగూడ పోలీసుల ఆధ్వర్యంలో మెడికోలకు అవగాహన కల్పించారు. ఎస్ఐ కిశోర్మాట్లాడుతూ.. డ్రగ్స్గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గాంధీ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణమోహన్, ఆయా డిపార్ట్మెంట్ల ప్రొఫెసర్లు, మెడికోలు పాల్గొన్నారు.