ఇంస్టెంట్ లోన్స్ యాప్ నిర్వాహాకుల వేధింపుల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 మందిని అరెస్టు చేశారు. గూర్గావ్ కేంద్రంగా ముఠాలు లోన్స్ మంజూరు చేస్తూ.. వేధింపులకు దిగుతున్నట్లు గుర్తించి దాడులు చేశారు. ఇప్పటి వరకు వివిధ యాప్ సంస్థల నుంచి 320 కోట్ల డబ్బును సీజ్ చేశారు పోలీసులు. ఇక ఆన్ లైన్ గేమంగ్ కేసులోనూ దర్యాప్తు స్పీడప్ చేశారు. 105 కోట్ల డబ్బు చైనాకు చేరినట్లు గుర్తించారు పోలీసులు. ఇన్ స్టెంట్ లోన్ యాప్ లపై వరుసగా కేసులు పెరగడంతో టీంలు గా ఏర్పడి దాడులు చేస్తున్నారు. గుర్గావ్, ఢిల్లీ, బెంగళూర్, కర్ణాటకతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో దాడులు చేశారు.
see more news