ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా సీపీఐ 100వ వార్షికోత్సవాలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా  సీపీఐ 100వ వార్షికోత్సవాలు

సీపీఐ నూరో వార్షికోత్సవాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. చండూరు మండలం గుండ్లపల్లిలో రోడ్డు వద్ద కామ్రేడ్​ మందడి నర్సింహారెడ్డి స్తూపం వద్ద సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామలింగయ్య జెండావిష్కరణ చేశారు. గుండ్రాంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కామ్రేడ్​ బోడిగే సైదులు జెండావిష్కరించారు. హుజూర్​ నగర్​లో సీపీఐ రాష్ర్ట కౌన్సిల్​ సభ్యుడు యల్లావుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి కేక్​ కట్​ చేశారు. 

​యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏశాల అశోక్​ ఆధ్వర్యంలో లీడర్లు జెండా ఆవిష్కరణ చేశారు. నార్కట్​పల్లిలో జిల్లా సహాయ కార్యదర్శి లోడంగి శ్రవణ్​కుమార్​ ఆధ్వర్యంలో జెండావిష్కరించారు. దేవరకొండ పార్టీ ఆఫీస్​లో సీపీఐ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేది ఎర్రజెండా పార్టీయేనని, పార్టీ తరఫున పోరాటాలను వివరించారు.- చండూరు/ చిట్యాల/ హుజూర్​ నగర్/ యాదాద్రి/ నార్కట్​పల్లి/ దేవరకొండ, వెలుగు