కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా.. పట్టించుకోని ఆఫీసర్లు

కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జా.. పట్టించుకోని ఆఫీసర్లు

కరీంనగర్ సిటీ, వెలుగు: తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకోరా అని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆదివారం సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రెవెన్యూ పరిధిలోని 574 సర్వే నంబర్ లో గల  14 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఆరోపించారు.

  ఆ భూమిలో ప్రైవేటు విద్యాసంస్థ వారు ఆక్రమించి అందులో కళాశాల భవనాలు నిర్మించారని అన్నారు.  ప్రభుత్వ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  సమావేశంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, కరీంనగర్ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయిని తిరుపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, కసిరెడ్డి మణికంఠ రెడ్డి,నాయకులు మామిడిపల్లి హేమంత్ కుమార్ పాల్గొన్నారు.