వచ్చే ఎన్నికల్లో బలం ఉన్న చోట పోటీ చేస్తాం : చాడ వెంకట్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో బలం ఉన్న చోట పోటీ చేస్తాం : చాడ వెంకట్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో సీపీఐకి గట్టిపట్టున్న ఐదు స్థానాలతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ పోటీ చేస్తామన్నారు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. పొత్తుల కోసం ఎవరితోనూ సంప్రదించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఒకవేళ ఎవరైనా అడిగితే అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. ఇంతకుముందు మాదిరిగాపోత్తులు అంటూనే తమతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. 

తమకు బలం ఉన్న ప్రతి చోట అభ్యర్థులను నిలబెడుతామని చెప్పారు. బీజేపీ పార్టీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి ఈ కామెంట్స్ చేశారు.