భూదాన్ భూములను పేదలకు పంచాలి

భూదాన్ భూములను పేదలకు పంచాలి

భూదాన్ భూములను భూమిలేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేశారు.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. భూదాన్ భూముల్లో పేదలు ఇల్లు కట్టుకునేలా ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారు.  పేదలకు దక్కాల్సిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి పోతున్నాయన్నారు. అఖిల భారత సర్వేసేవ సంఘ్, తెలంగాణ సర్వోదయ మండలి ఆధ్వర్యంలో... హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేశారు. భూదాన్ భూములు పేద ప్రజలకు పంచే వరకు పోరాటం చేస్తామన్నారు సీపీఐ నేత అజీజ్ పాషా.