- రిస్కులో లక్ష కోట్ల విలువైన లోన్లు
ముంబై: కరోనా వల్ల చాలా మంది క్రెడిట్ కార్డు హోల్డర్ల ఆదాయం విపరీతంగా పడిపోవడంతో వసూళ్లు తగ్గుతున్నాయని, ఇవి మరింత పెరుగుతాయని ఆర్బీఐ హెచ్చరించింది. క్రెడిట్కార్డుల బకాయిలు ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో రూ.లక్ష కోట్లు దాటాయని వెల్లడించింది. ‘‘గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత బకాయిల విలువ పదిశాతం ఎక్కువ. బ్యాంకులు, క్రెడిట్కార్డు కంపెనీలు అలర్ట్గా ఉండాలి. క్రెడిట్ కార్డు బిజినెస్లో ఐదుశాతం నెగెటివ్ గ్రోత్ రికార్డు అయింది. ఎగవేతలను తట్టుకోవడానికి పది శాతం ఫండ్స్ను ప్రొవిజన్ చేయాలి” అని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ వంటి అన్సెక్యూర్డ్ లోన్స్ గత ఐదేళ్లలో విపరీతంగా పెరిగాయి. వసూళ్లు తక్కువగా ఉండటం, మొండిబాకీలు పెరగడంతో వీటి జారీ ఇప్పుడు మోస్తరు స్థాయిలో ఉంది. కొన్ని బ్యాంకు లోన్లలో ఈ రెండు సెగ్మెంట్ల వాటాయే 30 % వరకు ఉంది. గ్లోబల్ ఎకానమీ దెబ్బతినడం, జాబ్స్ పోవడం, జీతాలు తగ్గడంతో అన్ని దేశాల్లో లోన్ల ఎగవేతలు పెరగొచ్చని బ్యాంకింగ్ ఎక్స్పర్టులు చెబుతున్నారు. హోం, కార్ లోన్ల కంటే క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ల వసూళ్లు తక్కువగా ఉంటాయని అంటున్నారు. దీంతో రిస్కు ఎక్కువగా ఉండే కమర్షియల్, బిజినెస్కార్డులను యాక్సిస్ వంటి బ్యాంకులు బాగా తగ్గిస్తున్నాయి.