
- వెయిట్ లిఫ్టింగ్ను రికమెండ్ చేసిన ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు
ముంబై : ఎట్టకేలకు ఒలింపిక్స్లోనూ క్రికెట్ను చూసే అదృష్టం ఫ్యాన్స్కు దక్కబోతున్నది. ఈ మేరకు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టేందుకు ఐవోసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు శుక్రవారం ఆమోద ముద్ర వేసింది. టీ20 ఫార్మాట్లో మ్యాచ్లు జరగనున్నాయి. క్రికెట్తో పాటు బేస్బాల్, సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోస్ (సిక్సర్లు), స్క్వా ష్కు కూడా ఒలింపిక్స్లో చోటు దక్కింది.
ఐవోసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ అధ్యక్షతన ఆదివారం జరిగే మీటింగ్లో వీటికి సంబంధించిన ఓటింగ్ జరగనుంది. మరోవైపు ఇండియా బలంగా ఉన్న కాంపౌండ్ ఆర్చరీని 2028 ఒలింపిక్స్లో చేర్చేందుకు ఐవోసీ బోర్డు నిరాకరించింది. బాక్సింగ్ వరల్డ్ ఫెడరేషన్కు ఐవోసీ గుర్తింపు లేకపోవడంతో బాక్సింగ్ను చేర్చే విషయాన్ని హోల్డ్లో పెట్టింది. మోడర్న్ పెంటాథ్లాన్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడలను రికమెండ్ చేసింది.