Cricket World Cup 2023 : ఇండియా – పాక్ మ్యాచ్ డేట్, స్టేడియం ఫిక్స్

Cricket World Cup 2023 : ఇండియా – పాక్ మ్యాచ్ డేట్, స్టేడియం ఫిక్స్

వన్డే క్రికెట్.. ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల అయ్యింది. 2023, జూన్ 27వ తేదీన ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీ.. అహ్మదాబాద్ వేదికగా.. మోదీ స్టేడియంలో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే మ్యాచ్ జరిగే స్టేడియం ఫిక్స్ కావటం విశేషం.

అహ్మదాబాద్ లో.. ఇండియాతో మ్యాచ్ ఆడే విషయంలో పాకిస్తాన్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. అహ్మదాబాద్ లో రక్షణ లేదని కొన్నాళ్లు.. అక్కడ పిచ్ బాగోలేదని మరికొన్ని రోజులు విమర్శలు చేస్తూ వచ్చింది. అహ్మదాబాద్ లో కాకుండా.. మరో స్టేడియం వేదికగా ఇండియాతో ఆడటానికి అభ్యంతరం లేదని ప్రకటించింది పాకిస్తాన్. 

ALSOREAD:ICC World Cup 2023: వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్..ఉప్పల్ లో మూడు మ్యాచ్ లు

అయితే పాకిస్తాన్ అభ్యంతరాలను ఐసీసీతోపాటు బీసీసీఐ పరిగణలోకి తీసుకోలేదు. అహ్మదాబాద్ లోనే ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు షెడ్యూల్ చూస్తే స్పష్టం అయ్యింది. అక్టోబర్ 15వ తేదీ ఈ మ్యాచ్ జరగనుంది. 

2011 తర్వాత.. ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ మ్యాచులు ఇవే కావటంతో.. క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.