
ఫిలీంనగర్ లాండ్ వివాదంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన కొడుకు రానాపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ల్యాండ్ విషయంలో తమను దౌర్జన్యంగా రౌడీల సాయంతో ఖాళీ చేయించారని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి బంజారాహిల్స్ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కొన్ని రోజుల క్రితం వ్యాపారి ప్రమోద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. దీంతో పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, రానాతో పాటు మరికొంత మందిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణకు రావాలని కోర్టు నోటీసులు పంపించింది.